దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!
లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన దుండగులు
ఉపాధి హామీ కూలీల సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘటన
మృతురాలు తాళ్లపెల్లి సుమలతగా గుర్తింపు.. పోలీసుల దర్యాప్తు
కాకతీయ, దుగ్గొండి : మండలంలోని లక్ష్మీపురం గ్రామ శివారులో గురువారం ఉదయం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఒక వివాహితను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలతగా పోలీసులు గుర్తించారు. లక్ష్మీపురం – ఏల్కుర్తి గ్రామాల మధ్య ఉన్న కెనాల్ సమీపంలో ఈ ఘాతుకం జరిగింది. గురువారం ఉదయాన్నే ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళ్తున్న ఏలుకుర్తి గ్రామస్తులకు రక్తపు మడుగులో పడి ఉన్న సుమలత మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
*దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!*
*లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన దుండగులు*
*ఉపాధి హామీ కూలీల సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘటన*
*మృతురాలు తాళ్లపెల్లి సుమలతగా గుర్తింపు.. పోలీసుల దర్యాప్తు*https://t.co/c7fKoMbb5D pic.twitter.com/0l4ZNzvMh8
— Kiran Arelly (@ArellyKiran1988) May 21, 2026
క్లూస్ టీమ్తో ఆధారాల సేకరణ
హత్య సమాచారం అందుకున్న వెంటనే దుగ్గొండి ఎస్సై రణధీర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్లూస్ టీమ్ సహాయంతో అక్కడి ఆధారాలను సేకరిస్తున్నారు. సుమలతను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పండగ పూట ఊరి వెలుపల వివాహిత దారుణ హత్యకు గురికావడంతో లక్ష్మీపురం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

