epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇది ప్ర‌గ‌ల్బాల ప్ర‌భుత్వం

ఇది ప్ర‌గ‌ల్బాల ప్ర‌భుత్వం
అభివృద్ధికి కాదు.. అబద్ధాలాకే ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్యం
కేంద్ర నిధులతో కట్టి.. ఇందిరమ్మ ఇళ్లుగా అబ‌ద్ధపు ప్ర‌చారం
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
మొదటి నెలలోనే రూ.11 వేల కోట్ల అప్పు తెచ్చుకున్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బ‌హిరంగ‌ చ‌ర్చ‌కు సిద్ధం
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స‌వాల్‌

కాక‌తీయ‌, హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్ధాలు ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో కలిసి ధాన్యం కొనుగోళ్లు ఇందిరమ్మ ఇళ్లు ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సుమారు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే పరిమితమైందని విమర్శించారు. దేశంలో కేంద్రం కొనుగోలు చేసే వడ్లలో 60 శాతం తెలంగాణ నుంచే కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు కేవలం ధాన్యం మాత్రమే కాకుండా మొక్కజొన్న జొన్న సన్‌ఫ్లవర్ కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇప్పటికే 2400 సెంటర్లు మూసేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల ధాన్యం తీసుకువచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందు పోస్తామని హెచ్చరించారు.

కేంద్ర నిధులతోనే ఇందిరమ్మ ఇళ్లు
గృహ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసంచేస్తోందని లక్ష ఇళ్ల నిర్మాణం జరిగిందన్న వాదన అవాస్తవమన్నారు. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయించిన 7000 కోట్ల రూపాయలలో 4644 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేనని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఇళ్లు నిర్మించి వాటికి ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెట్టుకోవడం ప్రజలను మోసంచేయడమేనన్నారు ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర అనుమతుల ప్రక్రియ పూర్తి చేయకుండా కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 58 వేల కోట్ల రూపాయలు అయితే కేవలం మొదటి నెలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుందని ధ్వజమెత్తారు అప్పు తెచ్చుకుంటే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దారుణమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతి వారం 2500 కోట్ల రూపాయల నిధుల కొరత ఉందని స్వయంగా ఆర్థిక మంత్రే చెబుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఇంతలా సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పునర్నిర్మాణం కేవలం బీజేపీతోనే సాధ్యమని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.