జైల్ భరో విజయవంతం చేయాలి
కాకతీయ, కారేపల్లి: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ సింగరేణి మండల కన్వీనర్ కే. నరేంద్ర పిలుపునిచ్చారు. కారేపల్లి పీహెచ్సీలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు వాంకుడోత్ కమల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్లు, ఉపాధి హామీ, విద్యుత్ చట్టం వంటి అంశాలతో కార్మికులు, రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల స్థిర వేతనం, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గింపు వంటి డిమాండ్లతో జైల్ భరోలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా నాయకురాలు పద్మ, జంగా కళ్యాణి, ఈసం ఈశ్వరి, సరస్వతి, వై. పద్మ తదితరులు పాల్గొన్నారు.

