కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ను కొనసాగించాలి
ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలి
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన.. ఆర్డీవోకు వినతిపత్రం
కాకతీయ, నర్సంపేట టౌన్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించి పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర పేద కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.
పెండింగ్ లబ్ధిదారులకు సాయం అందించాలి
ప్రస్తుతం ఈ పథకాల అమలుపై నెలకొన్న అనిశ్చితిని ప్రభుత్వం వెంటనే తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. కోర్టు పరిణామాలను సాకుగా చూపకుండా పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించే అంశాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పార్టీలకు అతీతంగా కొనసాగించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నర్సంపేట ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిడి రవీందర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, లెక్కల విద్యాసాగర్రెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, నామాల సత్యనారాయణ, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు, వేణుముద్దల శ్రీధర్రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, మండల శ్రీనివాస్, రాయుడు దుశాంత్రెడ్డి, బూస రాజు, దొమ్మటి సంతోష్, నవీన్నాయక్, పెండెం వెంకటేశ్వర్లు, కడారి కుమార్, కందికొండ శ్రీనివాస్, బీరం నాగిరెడ్డి, బండి ప్రవీణ్, చింతల టార్జాన్ తదితరులు పాల్గొన్నారు.

