epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోడు భూముల్లో మళ్లీ లొల్లి

  • ట్రెంచ్ పనులు ఆపాలని జేసీబీని అడ్డుకున్న గిరిజనులు
  • పోడు భూముల్లో ఉద్రిక్తత వాతావరణం

కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మల్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని బోటుగూడెం గ్రామపంచాయతీ బందగిరి నగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే ముందు నుండే ఈ భూములను తాము సాగు చేసుకుంటున్నామని పోడు రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో పంటలు కూడా వేశామని, అయినా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ పేరుతో అడ్డుకున్నారని పోడుదారులు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అంతరించి పోతున్న అడవులను సంరక్షించాలని అటవీశాఖలో కొత్తగా వచ్చిన అధికారులు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ క్లస్టర్ పరిధిలో సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారన్నారు. అయితే పినపాక మండల వ్యాప్తంగా చాలా చోట్ల వందలాది ఎకరాల్లో రైతు పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయొద్దని పోడుదారులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధుల మాట బేఖాతరు..
ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని పోడుదారులు వాపోయారు. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం చెప్పిన ఆయన ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ జేసీబీ ముందు గిరిజనులు పడుకున్నారు. దీంతో గిరిజన రైతులను పోడు భూముల్లోనుంచి అటవీశాఖ అధికారులు గిరిజనులను తప్పుకోవాలని చెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరుతో గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు భీష్మించుకున్నారు.

పోడు రైతులకు అండగా ఉంటాం: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
పోడు రైతులకు అండగా ఉంటామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. బుధవారం ట్రెంచ్ కొడుతున్న బండగిరి నగరం చేరుకొని అక్కడ గిరిజన సమస్యలు తెలుసుకున్నారు. అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు. సాగులో ఉన్న భూముల్లో ఈ పనులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త భూమి నరికితే అది గిరిజనులదైనా తప్పే అన్నారు. కానీ పాత భూములు ట్రంచ్ కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలిపివేయకపోతే మరో ఉద్యమానికైనా సిద్ధమన్నారు. స్థానిక అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని అయినా ఇలా గిరిజన భూముల్లో పనులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యేతో మాట్లాడాం, సమస్యను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నాయకుడు బండారు సాంబ
పోడు రైతుల సమస్య తెలియగానే బందగిరి నగరానికి చేరుకుని, తక్షణమే పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లుతో మాట్లాడామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండారు సాంబ తెలిపారు. గిరిజన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని, తక్షణమే ట్రంచ్ పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులకు తెలిపినట్లుగా సాంబ తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత అటవీ శాఖ భూములు ఉంటే వారికి అందిస్తామని సైతం తెలిపారు. కానీ ఎంతో కాలంగా పోడు సాగు చేసుకుంటున్న భూములపై దౌర్జన్యం వద్దని అన్నారు.

ఫారెస్ట్ హద్దులు దాటి ట్రంచ్ పనులు నిర్వహించడం లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని, డీడిఆర్ఓ అరుణ తెలిపారు. బందగిరి నగరంలో ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ట్రంచ్ పనులు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గిరిజనుల ఆవేదన అర్థం చేసుకొని రెండు రోజులు ట్రంచ్ పనులు నిలిపివేస్తున్నామని తెలిపారు. జిపిఎస్ మ్యాప్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఫారెస్ట్ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఎవరి భూములు ఉద్దేశపూర్వకంగా లాక్కోవడం లేదని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.