epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్థానిక ఎన్నికలు … ఇజ్జత్ కా సవాల్‌..

  • పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
    బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలకు నిధులు
    ఎమ్మెల్యేకు ఫండ్స్ లేవు, పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదు
    పంచాయతీలకు బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంతా కాదు
    ప్రతి ఇంటికీ 3 సార్లు వెళ్లి ప్రచారం చేయండి
    కాషాయ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు నుండి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్ గా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా నాయకులకు పతారా ఉంటుందని, తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వారిని గెలిపించేందుకు అన్ని విధాలా క్రుషి చేస్తానన్నారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫ‌రెన్స్ లో క‌రీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ఇంచార్జీలు గంగిడి మనోహర్ రెడ్డి, శాంతికుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాలి

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సర్వేలు అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, స్థానిక ఎన్నిక‌ల‌కు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. టిక్కెట్ల ఎంపికలో రాష్ట్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని, నేను అభిప్రాయం చెప్పొచ్చు కానీ, అది ఫైనల్ కాదని గెలుపు సాధ్యమయ్యే అభ్యర్థులనే పార్టీ ప్రకటిస్తుందని బండి స్పష్టం చేశారు. నామినేషన్లు వేసేందుకు నేతలు కావలసిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాకు గ్రూపులు లేవు, నాది బీజేపీ గ్రూపే పార్టీ అని అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అని వ్యాఖ్యానించిన బండి సంజయ్, పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏకైక ఎంపీగా నేనే ..

ప్రతి గ్రామానికి రూ.5 నుండి రూ.20 లక్షల వరకు నిధులు విడుదల చేసిన ఏకైక ఎంపీగా నేనే అని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్, జాతీయ ఉపాధి హామీ పథకాల కింద కేంద్ర నిధులతోనే రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బండి సంజ‌య్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నయాపైసా నిధి లేదని, బీఆర్ఎస్ పల్లెలకు చేసిన మోసాలు మరువలేమ‌ని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేశారన్నారు. అటువంటి పార్టీకి ఓటేసిన‌ ప్రజలకు ఏమి ప్రయోజనం?” అని బండి ప్రశ్నించారు.

ప్రచారానికి పూర్తి సమయం కేటాయిస్తా.

ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు రెట్టింపు శ్రమ చేయాలి. నేను కూడా పూర్తిగా ప్రచారానికి సమయం కేటాయిస్తాను అని కార్యకర్తలను బండి సంజ‌య్ తెలిపారు. ప్ర‌తి ఇంటికీ కనీసం మూడు సార్లు వెళ్లి బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రజలను కోరాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విరక్తి పెరిగిందని, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపున‌కు కృషి చేయాలని సంజ‌య్ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.