epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజాధనంతో ప్రచారం

ప్రజాధనంతో ప్రచారం
సీఎం రేవంత్‌పై ఈసీకి జాగృతి నేత‌ల‌ ఫిర్యాదు
ప్రభుత్వ వేదికపై కాంగ్రెస్‌కు ఓటేయమని ప్ర‌చారం
ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేశారు
ఫిర్యాదులో పేర్కొన్న జాగృతి నేత‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ లింగ్యా నాయక్‌కు ఫిర్యాదు లేఖను జాగృతి నేతలు అందజేశారు. సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. రూప్‌సింగ్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలను కోరడం పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన సీఎం, ప్రభుత్వ వేదికను ఉపయోగించుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సీఎం ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘించారని, అప్పుడు తమ సంస్థ అధ్యక్షురాలు కవిత స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రూప్‌సింగ్ గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌కు లేఖ రాసి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పినట్లు వెల్లడించారు.

నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు

జాగృతి సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఆయన యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టీఎన్ శేషన్ రూపొందించిన ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, కానీ నిబంధనలను పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కనుసన్నుల్లో కాకుండా ఈసీ కనుసన్నుల్లో ఎన్నికలు జరగాలని, బాధ్యతాయుత పదవిలో ఉన్న సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

జాగృతి నాయకుడు నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, ప్రజాపాలన అని చెప్పే సీఎం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారని, ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని, ఈసారి మాత్రం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పిదాలను ప్రజలకు వివరించి ఆయన తీరును ఎండగడతామని, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, నరేందర్ యాదవ్, మరిపెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.