epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీత‌క్క జ‌వాబు చెప్పు

సీత‌క్క జ‌వాబు చెప్పు
కేసీఆర్‌కు లీగ‌ల్ నోటీసులెందుకు?
స్మార్ట్ ఫోన్ల కుంభకోణంతో ఆయ‌న‌కు ఏం సంబంధం?
310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో ముమ్మాటికీ అవినీతి
అంగన్వాడీ వర్కర్స్‌కు తక్కువ ధర స్మార్ట్ ఫోన్లు
రూ. 54 కోట్లకు టెండర్.. రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు
మిగిలిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయి?
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వ‌జం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం ఉందని లీగల్ నోటీసులు పంపించారో మంత్రి సీతక్క సమాధానం చెప్పాల‌ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉంద‌న్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. 35 వేల 310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని మేం గత కొన్ని రోజులుగా తెలియజేస్తున్నాం అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, తక్కువ ధరకు మొబైల్ కొనుగోలు చేసి ఇచ్చార‌ని మ‌రోమారు ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు టెండర్ రూ. 54 కోట్లకు పిలిచార‌ని, 35 వేల 310 స్మార్ట్ ఫోన్లకు రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశార‌ని, మిగిలిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సీతక్క చెప్పుతో కొడతాం అని అంటుందన్నారు.

చెప్పుతో కొడుతా అనడం ఏంటి…?

మెమరీ ధరలు పెరగడంతో కాంట్రాక్ట్ నుంచి సామ్ సంగ్ మొబైల్ సంస్థ ఎగ్జిట్ అయిందని అంటున్నారు. మాకు సంస్కారం ఉంది. మా నాయకుడు కేసీఆర్ సంస్కారం నేర్పించారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క లేఖ రాశారు. మేం తప్పుడు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణ చెయ్యండి అని లేఖ రాయొచ్చు కదా. సల్మాన్ ఖాన్ పక్కన, మిస్ వరల్డ్ పోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇప్పించాడని మాకు అనుమానం ఉంది. మా నాయకులపై కేసులు పెట్టి విచారణకు పిలిస్తే విచారణకు హాజరు అయ్యారు కదా… మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5జీ మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం తన సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5 స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. 4జీ ఫోన్లు ఇస్తూ, 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలి. సీతక్క చెప్పుతో కొడితే పడుతాం.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. అంగన్వాడి వర్కర్స్ కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్ నాకు సంబంధమే లేదని సీతక్క మాట్లాడి, ఇప్పుడు చెప్పుతో కొడుతా అనడం ఏంటి…? అని క్రిశాంక్ ప్ర‌శ్నించారు.

సీత‌క్క వ్యాఖ్య‌ల‌పై సతీష్‌రెడ్డి ఆగ్ర‌హం

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిజాలు చెప్పకుండా మమ్మల్ని చెప్పుతో కొడతాం అని మాట్లాడిన సీతక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ , ములుగు ఎక్కడికైనా వెళ్దాం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి స్మార్ట్ ఫోన్ ఎంత ధర ఉందో తెలుస్తుంది. 50 కోట్ల టెండర్ పిలిచి
11 వేలు మాత్రమే ఉండే 4జీ ఫోన్ ను కొనుగోలు చేశారు. పక్క రాష్ట్రాల్లో 5g ఫోన్లు ఇస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో 4జీ ఫోన్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాపై ఆరోపణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికీ వేల ఎకరాల పంటలు పండుతున్నాయి. ధన దాహంతో ములుగులో నలుగురిని పొట్టన పెట్టుకున్న విషయం మర్చిపోయావా సీతక్క. మేడారం జాతర టెండర్ కోసం ఇద్దరు మంత్రులు కొట్టుకుంది నిజం కాదా. 6 యేండ్ల బాలుడిని జీవితాంతం అంగ అంగవైకల్యం వచ్చేలా చేసింది మీరు కాదా ..? ములుగు గ్రామ పంచాయతీలో జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం అందులో పనిచేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది వాస్తవం కాదా…? ఇవ్వన్ని జరుగుతుంటే మీపై ఎన్ని కేసులు పెట్టొచ్చు. ఎన్ని నోటీసులు ఇవ్వాలో సీతక్క సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

నిజాయితీ ఉంటే సీబీఐతో విచార‌ణ జ‌ర‌పాలి

స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో విచారణ చేసి నిజాయితీ నిరూపించుకోండ‌ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి అన్నారు. కాంగ్రెస్ పాలకులు మాట మాట మాట్లాడితే మాది ప్రజా పాలన అని మాట్లాడుతున్నారు. తక్కువ ధరకు మార్కెట్ లో ఫోన్ దొరుకుతుంటే , ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు అని మేం ప్రశ్నించాం. అంగన్వాడి వర్కర్స్ స్మార్ట్ ఫోన్ల కొనుగోల్లో విచారణ చేసి నిజాయితీ నిరూపించుకుంటే మంచిదే కదా. స్మార్ట్ ఫోన్ల కొనుగోల్లో నిజాయితీ నిరూపించకుండా , చెప్పుతో కొడతాం అని సీతక్క అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ పై సీబీ సీఐడీ విచారణ చేయిస్తాం అన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ల కొనుగోలు పై ఎందుకు విచారణ చేయిస్తాం అనడం లేదు. కాంగ్రెస్, బిజెపి రెండు ములాఖాత్ అయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. సీతక్కకు నిజాయితీ ఉంటే
స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయాల‌ని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.