epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి

పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి
పర్యాటకులు పెరిగేలా సమగ్ర ప్రణాళికలు
జ‌లాశ‌య కేంద్రాల్లో ఆధునిక బోట్ల ఏర్పాటుకు చర్యలు
మాస్టర్ ప్లాన్‌లతో ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
మౌలిక సదుపాయాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కాక‌తీయ‌, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటకుల సంఖ్య పెరిగేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీజీటీడీసీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

జిల్లాల ప్ర‌గ‌తిపై మంత్రి ఆరా..!

జిల్లాల వారీగా రూ.274.93 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన టైం లైన్ నిర్దేశించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌ల తయారీ, కాటేజీల నిర్మాణం, కేంద్ర పథకాల అమలు, నిధుల వినియోగంపై మంత్రి చర్చించారు. ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో-వెల్నెస్, హస్తకళలు, జల, బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని సూచించారు. నాగార్జున సాగర్, రామప్ప-వరంగల్, యాదగిరిగుట్ట-పోచంపల్లి, సోమశిల-ఆలంపూర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. రామప్ప ఆలయం సమీపంలో అదనపు కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన చోట సంప్రదాయ బోట్ల స్థానంలో ఆధునిక బోట్లను ప్రవేశపెట్టాలని, సోమశిలలో అదనపు బోటింగ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఎత్తైన ప్రాంతాల్లో క్యాంటీలివర్ వ్యూ పాయింట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

వారసత్వ సంపదను సంరక్షిస్తూ పర్యాటకులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, నిర్వహణ, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ ప్రాంతాల్లో కళా ప్రదర్శనల కోసం థియేటర్ల నిర్మాణం చేపట్టి స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించాలని సూచించారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనుకూల వాతావరణం సృష్టించాలని పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పర్యాటక రంగ విస్తరణతో రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, ఎండీ గౌతమి, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.