మహబూబాబాద్ జిల్లాలో 25 మంది ఎస్సైల బదిలీ
పోలీస్ శాఖలో భారీగా మార్పులు
కీలక స్టేషన్లకు నూతన అధికారుల కేటాయింపు
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం భారీగా బదిలీ అయింది. జిల్లా వ్యాప్తంగా 25 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు కీలక పోలీస్ స్టేషన్లకు నూతన ఎస్సైలను కేటాయించారు. మహబూబాబాద్ సీసీఎస్ విభాగంలో వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే గంగారం ఎస్సైగా కోటేశ్వరరావు, కురవికి సతీష్, మరిపెడకు గండ్రతి సతీష్, దంతాలపల్లికి రవికుమార్ బదిలీ అయ్యారు. మహబూబాబాద్ రూరల్ ఎస్సైగా రాజు, చిన్నగూడూర్కు కుషకుమార్, నర్సింహులపేటకు వెంకన్న, బయ్యారానికి ప్రశాంత్ బాబును నియమించారు. డోర్నకల్ ఎస్సైగా ఝాన్సీ, మరిపెడ-2 ఎస్సైగా మహిబుబి, తొర్రూర్ ఎస్సైగా ఖాదర్ పాషా బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా ఉమా, టౌన్-2 ఎస్సైగా నరేష్ నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ నూతన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు అందాయి.

