epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడనీయం

హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడనీయం
విమాన ఛార్జీల పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
నగరంలోని ఆటోలకు ఉచితంగా ‘ఈవీ’ రెట్రో ఫిట్టింగ్
అభివృద్ధి, సంక్షేమంలో మైనారిటీలకు సముచిత వాటా
హజ్ బస్సుల ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో వారికి దక్కాల్సిన వాటాను నిరంతరం అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా పెరిగిన ప్రయాణ ఛార్జీల భారాన్ని యాత్రికులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇరాన్, ఇరాక్ యుద్ధ వాతావరణం కారణంగా విమాన ఇంధన ధరలు పెరిగి ప్రయాణం భారమైందని, అయినప్పటికీ మైనారిటీ సోదరుల సౌకర్యార్థం ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం తన భుజాన వేసుకుందని వెల్లడించారు.

ఆటో డ్రైవర్లకు అండ.. యువతకు నైపుణ్యం
హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో మైనారిటీ సోదరులు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నడిచే అన్ని ఆటోలకు ఉచితంగా ‘రెట్రో ఫిట్టింగ్’ చేసి, వాటిని ఈవీ (ఎలక్ట్రిక్) ఆటోలుగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనివల్ల ఇంధన ఖర్చులు ఆదా అయి ఆటో డ్రైవర్ల ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో వైట్ కాలర్ ఉద్యోగాల కంటే బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉన్న అవకాశాలను యువత అందుకునేలా ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు గుర్తుచేశారు.

మానవీయతతో సాయం.. ఐక్యతకు పిలుపు
గత ఏడాది హజ్ యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మరణించగా, మానవీయ కోణంలో స్పందించిన తమ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని.. అందరూ ‘భాయీ-భాయీ’గా మెలుగుతూ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ‘SIR’ పేరుతో రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ జరగనివ్వకుండా అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.