వేణుమాధవ్-నళిని నారాయణ్ దంపతుల దాతృత్వం
: సదాశయ ఫౌండేషన్కు సౌండ్ సిస్టం వితరణ
కాకతీయ, నెల్లికుదురు : నేత్ర, అవయవ దానాలతో పాటు సామాజిక సేవలో అగ్రగామిగా నిలిచిన సదాశయ ఫౌండేషన్కు నెల్లికుదురు మండలం మేచరాజపల్లికి చెందిన మన ఊరు-మన గుడి ట్రస్ట్ చైర్మన్, వరంగల్ జిల్లా సదాశివ ఫౌండేషన్ అధ్యక్షుడు నాళ్ళ వేణుమాధవ్-నళినీ నారాయణ్ దంపతులు సౌండ్ సిస్టమ్ను వితరణ చేశారు. సదాశయ సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కోరిక మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ చేతుల మీదుగా ఈ సౌండ్ సిస్టమ్ను ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. గత 18 సంవత్సరాలుగా నేత్ర, శరీర అవయవ దానాలు, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తమ సంస్థకు అండగా నిలిచిన దాత వేణుమాధవ్ దంపతులను అడిషనల్ కలెక్టర్ వై.వి. గణేష్ అభినందించారు. అనంతరం అధికారులు, సంస్థ ప్రతినిధులు కలిసి దాతకు గ్రీన్ గిఫ్ట్ అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ దళపతి, సలహాదారు ప్రొ.లక్ష్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడు కె.పురుషోత్తం, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ రావు, ఉపాధ్యక్షులు ఆర్తి సంపత్ కుమార్, కె.రాంచంద్రారెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారస్వామి తదితరులు పాల్గొని దాతృత్వం చాటుకున్న దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

