epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

బీజేపీ ఎదుగుతోందనే కుట్ర‌లు
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అడ్డుకోవడం దుర్మార్గం
రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ రావాలని ప్రజల ఆకాంక్ష
కరీంనగర్ అభివృద్ధికి రూ. 22 వేల కోట్ల నిధుల మంజూరు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో / క‌రీంన‌గ‌ర్ : రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాజకీయం చేస్తూ అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా ఎదుగుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు ‘బిగ్ బాస్’ తరహాలో డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై విచారణ జరిపించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై విమర్శలు
సంక్షేమ పథకాలను కోర్టుకు తీసుకెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు. పథకం అమలు భారమైతే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి తప్ప, ప్రజలకు మేలు చేసే పనులను ఆపడం సరికాదని సూచించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 22 వేల కోట్లు తీసుకొచ్చానని మంత్రి తెలిపారు. ఇందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. యూసీఎఫ్ నిధుల కింద మంజూరైన రూ. 840 కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, పార్కింగ్, డంపింగ్ యార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా 37వ డివిజన్‌లో రూ. 77 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు.

  • అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యంతో కూడుకున్నవి. యూసీఎఫ్ నిధులు దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే వస్తే, అందులో కరీంనగర్ ఉండటం గర్వకారణం. కేంద్రం ఇస్తున్న నిధులతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొస్తున్న పథకాలను అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.