సీఎం పర్యటనకు ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలి
ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశం
భద్రత, మౌలిక సదుపాయాలపై సమీక్ష
కాకతీయ, ములుగు ప్రతినిధి: ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆగస్టు 12లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, హెలిప్యాడ్లు, వీఐపీ బస, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య, భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. శాఖల మధ్య సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

