ఇందిరమ్మ ఇండ్లకు దూరంగా గ్రామ సర్పంచ్..
– ప్రోటోకల్ పాటించని పరకాల ఎమ్మెల్యే రేవూరి..
– అభివృద్ధికి ఆమెడా దూరంలో కామరం..
– కాంగ్రెస్ నాయకులతోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలు..
– బీసీ మహిళా సర్పంచ్ లను అవమానంపరచిన పరకాల ఎమ్మెల్యే..
– గ్రామ ప్రథమ పౌరులకు దక్కని కనీస గౌరవం..
– కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి
కాకతీయ,ఆత్మకూరు : సంక్షేమ పథకాలకు ఎస్సి,బీసీ సర్పంచ్ లను దూరంగా ఉంచుతున్నారని కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి అన్నారు.ఆదివారం ఆత్మకూరు మండలం కామారం గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి స్థానిక గ్రామా సర్పంచ్ ను పిలవకుండా గృహ ప్రవేశం చేసారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా గ్రామా ప్రజలు మమల్ని గెలిపించారని అన్నారు.కాంగ్రెస్ హయాంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.గ్రామంలో సిసి రోడ్లు సర్పంచ్ కు తెలియకుండా పోస్తున్నారని గ్రామా ప్రథమ పౌరునిగా అడుగడుగునా బీసీ సర్పంచ్ లకు అగౌరవం ఉంది తప్ప ఎమ్మెల్యే తో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రోటోకల్ పాటించని పరకాల ఎమ్మెల్యే రేవూరి.
గ్రామాల్లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సర్పంచ్ ల పాత్ర శూన్యం అని కామారం సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి అన్నారు.గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోటోకాల్ పాటించారని ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులే తప్ప సర్పంచ్ లు కనిపించారని ఆరోపించారు.గ్రామంలో సర్పంచ్ కి తెలియకుండా నాణ్యత లేని సిసి రోడ్లు గ్రామల్లో వేశారని సర్పంచ్ లక్ష్మి కుమారస్వామి అన్నారు.
కాంగ్రెస్ నాయకులతోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలు..
పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో బిఆర్ఎస్ సర్పంచ్ లు గెలిసారని ప్రతిపక్ష మహిళా సర్పంచులకు అగౌరవం పరిచేలా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్,బీజేపీ గెలిసిన గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.గ్రామా సర్పంచ్ ల అనుమతులు లేకుండా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.సంక్షేమ పథకాల్లో ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నాయకులతోనే ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యవహరించి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాల సర్పంచ్ ల పై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎంత గౌరవం ఉందొ తెలుస్తుందని అన్నారు.
గ్రామ ప్రథమ పౌరుడిగా గొరవం దక్కేనా ..
గ్రామంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన మొదట గ్రామా ప్రథమ పౌరుడికి తెలియ చేయాలి.కానీ ఆత్మకూరు మండలం కామారం గ్రామంలో మాత్రం అది జరగడం లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన గ్రామంలో ప్రథమ పౌరులుగా ఉండే సర్పంచ్ లకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటికైనా పార్టీలకు అతీతంగా సర్పంచులకు కనీస గౌరవం విలువలు ఇవ్వాలని ప్రతిపక్ష సర్పంచ్ లు తెలుపుతున్నారు…

