epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు

ప్ర‌ధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్‌

పార్లమెంట్​ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీ ఆందోళ‌న‌

బీజేపీ తీరుకు వ్య‌తిరేకంగా నినాదాలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో (మీరు సరైనది అనుకున్నది చేయండి) అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పార్లమెంట్​ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఉదయం చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్, ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగించారు. భారత్​, అమెరికా డీల్​ను ట్రాప్​ డీల్​గా వర్ణిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో వారితోపాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొని నినాదాలు చేశారు. అప్పుడే మీడియాతో మాట్లాడుతూ, జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ విమర్శించారు.

అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటే: ఖ‌ర్గే

అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రసంగం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని, ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత, చైనా అంశాలపై తమ ఆందోళనలకు సరైన సమాధానం రాలేదనే కారణంతో సభను బహిష్కరించామని ఖర్గే తెలిపారు.
“ప్రధాని ప్రసంగానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన అసత్యాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటైపోయింది” అని ఖర్గే విమర్శించారు. 97 నిమిషాల ప్రసంగంలో ప్రధాని గత 100 ఏళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల చరిత్ర గురించి మాత్రమే మాట్లాడారని, కానీ ప్రస్తుత సమస్యలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన స్మృతిగ్రంథం (మెమోయర్) అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించిందని ఖర్గే ఆరోపించారు.

ప్రధాని ప్రసంగం అంతా అసత్యాలతోనే! జైరాం ర‌మేష్‌

అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్​ కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. “ప్రధాని ప్రసంగం అసత్యాలతో, అసహనంతో నిండి ఉంది. 97 నిమిషాల ప్రసంగం నిరాశాజనకం” అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని రమశ్ ఆరోపించారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశానని చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే చైనా అంశంలో కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.