epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు
భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌
భారీ యంత్రాలతో వాగులో తవ్వకాలు
మోతాదుకు మించి లోడింగ్‌తో రోడ్ల ధ్వంసం
రైతుల పంటలకు తీవ్ర నష్టం
అనుమానాలకు తావిస్తున్న అధికారుల మౌనం

కాకతీయ, బూర్గంపాడు : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండ‌లంలోని కిన్నెరసాని వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అక్రమార్కులు భారీ మిషనరీల సహాయంతో వాగులో ఇసుకను తవ్వి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్విన ఇసుకను అతి భారీ వాహనాల్లో మోతాదుకు మించి లోడ్ చేసి ఆంధ్ర, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు తరలిస్తున్నారు. రవాణా రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే అధిక లోడింగ్‌తో భారీ వాహనాలు వెళ్లినా ఎవరూ ఆపకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ అక్రమ రవాణా వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజా రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రయాణాలు కూడా కష్టసాధ్యమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ ముందు నుంచే రవాణా

ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ ఇసుక రవాణా మార్గం స్థానిక పోలీస్ స్టేషన్ ముందుగా ఉండటం. ప్రతిరోజూ ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వస్తున్నప్పటికీ ఈ అక్రమ దందాపై చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగొచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక ర్యాంప్‌కు అనుమతులు ఇచ్చింది ఎవరు, ఈ అక్రమ దందా వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నదుల్లో తవ్వాల్సిన ఇసుకను వాగుల్లో తవ్వడం పర్యావరణానికి ముప్పుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాగుల్లో అనియంత్రితంగా తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక కిన్నెరసాని వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఇసుక రవాణా వల్ల ఎగిసే దుమ్ము పంటలపై పడుతూ దిగుబడులను ప్రభావితం చేస్తోందని వారు చెబుతున్నారు. పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక దందాను అడ్డుకోకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.