సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
మండల ఫోరం అధ్యక్షుడిగా పులి రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా దస్తగిరిపల్లె సర్పంచ్ పులి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జాటోతు రవి చిన్న, వర్కింగ్ ప్రెసిడెంట్గా మచ్చిక రవి, ఉపాధ్యక్షులుగా దండెం సంపత్, కస్తూరి విజయలక్ష్మీ రవి, ప్రచార కార్యదర్శిగా నాగేల్లి జ్యోతి ప్రకాష్, మీడియా ఇంచార్జిగా సపావట్ కవితా దేవ్సింగ్, సంయుక్త కార్యదర్శిగా పాడియా రజిత మోతిలాల్, సహాయ కార్యదర్శిగా అర్రెం సాంబయ్యలు ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా ఊటుకూరి అశోక్, పల్నాటి మూర్తిని నియమించగా, కార్యవర్గ సభ్యులుగా కెలోతు రాజ్కుమార్, పురం భాస్కర్, భదావత్ మంజూల ఎన్నికయ్యారు

