epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్వారీ ఇస్తాన‌ని చీట్ చేశారు

క్వారీ ఇస్తాన‌ని చీట్ చేశారు
రూ.38 లక్షలు వసూలు చేసి..పోలీసులతో వేధింపులు
“నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. మానవత్వం చూపడం లేదు
సాక్ష్యాలు ఉన్నా ఫిర్యాదును అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు
ఇసుక స‌బ్ కాంట్రాక్ట‌ర్ భాస్కర్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
పైడాకుల అశోక్, ములుగు ఎస్పీల‌పై హెచ్చార్సీలో, ఐజీకి ఫిర్యాదు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : “నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. కనీస మానవత్వం చూపడం లేదు. ఇసుక క్వారీలు ఇప్పిస్తామని నమ్మించి నా జీవితాన్ని, ఆస్తులను, ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ములుగు జిల్లాలో ఇసుక మాఫియా నడుపుతున్న ఈ అక్రమార్కులు ఇప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని నన్ను వేధిస్తున్నారు. రాజకీయ పలుకుబడితో నా గొంతు నొక్కాలని చూస్తున్నారు” అంటూ ఇసుక‌ సబ్‌కాంట్రాక్టర్ బెల్లకొండ వెంకటేశ్వరరావు అలియాస్ భాస్కర్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, గిరిజన సంఘాల నేతలపై డయాలిసిస్ పేషెంట్, ఇసుక స‌బ్ కాంట్రాక్ట‌ర్ బెల్లకొండ వెంకటేశ్వరరావు అలియాస్ భాస్కర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఉపాధి హామీ ద్వారా ప్రారంభించిన ఇసుక క్వారీల సబ్‌కాంట్రాక్ట్ ఇస్తామని నమ్మించి రూ.38 లక్షల నగదుతో పాటు కోట్ల రూపాయలు ఖర్చు చేయించారని, చివరకు మాట తప్పి రాజకీయ పలుకుబడితో పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈమేర‌కు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీ అధ్యక్షుడు కోరం అబ్బయ్య, నరసింహస్వామి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పూస కార్తీక్, రామక్కపేటకు చెందిన కొండం బాలకృష్ణతో పాటు ములుగు జిల్లా ఎస్పీ, పస్రా సీఐ, మంగపేట ఎస్ఐలను ప్రతివాదులుగా పేర్కొంటూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

నిలువునా ముంచారు..!

మల్టీజోన్ ఐజీకి..లీగ‌ల్ నోటీసు,హెచ్ ఆర్సీకి భాస్క‌ర్‌రావు అంద‌జేసిన వివ‌రాల ప్ర‌కారం.. ఆయ‌న మాట‌ల్లోనే.. 2010లో కోరం అబ్బయ్య తనను సంప్రదించి చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీకి ఇసుక క్వారీ సబ్‌కాంట్రాక్ట్ ఇప్పిస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చి సొసైటీ రిజిస్ట్రేషన్, 360 మంది గిరిజన సభ్యులకు బ్యాంకు ఖాతాలు తెరవడం, చలానాలు చెల్లించడం, అప్పటి టీజీఎండీసీ, గనుల శాఖ అధికారుల వద్ద అనుమతుల కోసం రెండేళ్ల పాటు తిరుగుతూ రూ.8 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయితే క్వారీ అనుమతులు రాగానే ఎక్కువ డబ్బుల కోసం ఇతరులకు సబ్‌కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకున్నారు. 2018లో తన ఇంటికి వచ్చి ఒప్పందం చేసుకుని క్వారీ అనుమతుల తీసుకునే బాధ్యత అప్పగించారు. అప్పుడు మూడేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి అనుమతులు తీసుకొచ్చినప్పటికీ అప్పటి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ బెదిరించి క్వారీలను తన అనుచరులకు ఇప్పించుకున్నారు. తనను ఆ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు. ఆ మానసిక వేదనతో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం డే బై డే డయాలసిస్ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నాన‌ని భాస్కర్ రావు ఫిర్యాదులో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

2024లో మరోసారి ఒప్పందం..!

2023లో మళ్లీ సొసైటీ ప్రతినిధులు తనను సంప్రదించగా, 2024లో చుంచులక్ష్మి, నరసింహస్వామి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలతో మరోసారి ఒప్పందం కుదిరింది. మోసం జరగకుండా ఉండేందుకు కొండం బాలకృష్ణ ద్వారా ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ను కలిశాను. తన ఆరోగ్య పరిస్థితిని చూసిన అశోక్ రెండు ఇసుక క్వారీ పాయింట్లు (6, 10) ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాలకృష్ణ, కోరం అబ్బయ్య, పూస కార్తీక్‌లకు బ్యాంకు లావాదేవీల ద్వారా నేరుగా భారీ మొత్తంలొ డబ్బులు ఇవ్వడంతో పాటు గ్రామసభల నిర్వహణకు కూడా ఖర్చు చేశాను. అయితే ఆ రెండు క్వారీలను సందీప్ అనే వ్యక్తికి కేటాయించారని తెలిసిన తరువాత వారిని ప్రశ్నించగా, తనకు 7, 9 పాయింట్లు ఇప్పిస్తామని, ఇందుకు నిధులు అవసరమని చెప్పి మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. ములుగు కలెక్టరేట్ ఎదుట కొండం బాలకృష్ణకు రూ.38 లక్షలు నగదు అందజేశానని, డబ్బు తీసుకున్న తర్వాత అతడు ఫోన్‌కు స్పందించడం మానేశాడు. కోరం అబ్బయ్యను నిలదీయగా డబ్బు తీసుకున్న విషయాన్ని లిఖితపూర్వకంగా అంగీకరించారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా తన వాయిస్ రికార్డింగ్‌లను వాట్సాప్‌లో వైరల్ చేసి, పోలీస్ స్టేషన్‌లో తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. జూన్ 14, 2026న ములుగు ఎస్పీ, ఏఎస్పీ, సీఐ, ఎస్ఐలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా తనను రాజకీయ ఒత్తిడితో పస్రా సీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారు. తన వద్ద బ్యాంకు లావాదేవీలు, ఒప్పంద పత్రాలు, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని పేర్కొంటూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరిన‌ట్లు భాస్క‌ర్‌రావు తెలిపారు.

ఐజీకి ఫిర్యాదు…

మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించక ముందు కూడా భాస్కర్ రావు మల్టీజోన్ ఐజీకి కూడా పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించిన ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. చుంచుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ సొసైటీ ఇసుక రీచుల కారణంగానే తాను అనారోగ్యం పాలయ్యానని, ఆస్తులు అమ్మకుని దీనవాస్థకు చేరుకున్నానని ఆవేదనతో తెలిపారు.

లీగల్ నోటీస్…

చుంచుపల్లి ఇసుక రీచుల విషయంలో తనతో అగ్రిమెంట్ చేసుకుని ఇతరులకు రీచులను అప్పగించిన విషయంపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ ఎండీ కార్యాలయానికి కూడా భాస్కర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. సదరు క్వారీలకు ఇవ్వాల్సిన బిల్లులు మంజూరు చేయవద్దని ఆయన అభ్యర్థించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.