స్పీకర్పై తాతా మధు వ్యాఖ్యలు దుర్మార్గం
కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి
తాత మధుపై బీఆర్ ఎస్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమే
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి
కాకతీయ, హనుమకొండ : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలకు తాతా మధు తక్షణమే స్పీకర్కు, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హసన్పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేణిగుంట్ల అశోక్, డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, పుట్ట తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమానికి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ను కించపరిచేలా బాధ్యతారహితంగా మాట్లాడటం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమని ఇనగాల మండిపడ్డారు. స్పీకర్ పదవిని అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం మాత్రమే కాదని, మొత్తం రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ శాసనసభ స్పీకర్గా ఉన్నందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రావడం లేదని, అదే సమయంలో ఆయన పార్టీ నాయకులు బయటకు వచ్చి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఇనగాల విమర్శించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
తాతా మధుపై చర్యలు తీసుకోవాలి
తాతా మధుపై బీఆర్ఎస్ అధిష్ఠానం తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇనగాల డిమాండ్ చేశారు. అవసరమైతే ఆయనను సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం స్పీకర్పై తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బాల్మంచ్ అధ్యక్షుడు జిన్నపురెడ్డి రుగ్వేద్రెడ్డి, మహేందర్రెడ్డి, కిరణ్, సురేందర్రెడ్డి, ఐలయ్య, డీసీసీ నాయకులు బుచ్చిరెడ్డి, రవీందర్, మధు, సురేష్, రాజు, వెంకన్న, మహిళా నాయకురాలు పల్లెపు అనూష తదితరులు పాల్గొన్నారు.

