epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి
బోనస్ పెంపుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తాం
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు బోనస్ ప్రకటించాలని లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో జేఏసీ రాష్ట్ర నాయకులు బి.మధు, షేక్ షావలి, మల్లెల రామనాథం, గూడేల్లి యాకయ్య, కరుణాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించిన లాభాల వాటాలో 36 వేల మంది కాంట్రాక్టు కార్మికులను దగా చేసిందని కేవలం రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
కోల్బెల్టు ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. లాభాల బోనస్ లో రూ.20 వేలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బోనస్ చట్టం ప్రకారం చూసినా లాభాల్లో ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం వరకు బోనస్ చెల్లించాలన్నారు. గతంలో అనేకమార్లు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుభూతి పలికిన భట్టి విక్రమార్క గానీ, జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చి గెలిచిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు గానీ ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సమంజసం కాదన్నారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 20 నెలలు గడిచినప్పటికీ నేటికీ వేతనాలు పెంచక పోవడం, వీరి శ్రమతోటి వచ్చిన లాభాల నుండి కూడా సముచిత స్ధాయిలో ఇవ్వకపోవడంతో కాంట్రాక్టు కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి అలుముకొంటుందని అన్నారు.
గత సంవత్సరం కాంట్రాక్ట్ కార్మికులతో పాలాభిషేకాలు చేయించుకున్న ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాను పునః సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులకు సముచితమైన లాభాల వాటాను ఇప్పించాలని వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు భూక్యా రమేష్, సతీష్, తాండ్ర విజయ్, రాజశేఖర్, నునావత్ విజయ్, గుగులోత్ సక్రాం, మాతంగి రాజేష్, భాస్కర్, రాణి, సునీల్, రాధ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.