epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అధిక లాభాల మాయలో కోట్ల రూపాయల దోపిడి ముఠా అరెస్ట్..

అధిక లాభాల మాయలో కోట్ల రూపాయల దోపిడి ముఠా అరెస్ట్..

అధిక లాభం ఆశతో పెట్టుబడి పెడితే నష్ట పోవాల్సిందే.. పోలీసులు హెచ్చరిక..

కాకతీయ, వరంగల్ బ్యూరో :

జనగాం జిల్లా పాలకుర్తి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కోట్లలో ప్రజల డబ్బు మోసం చేసిన నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య పేరుతో హెబ్సిబా అనే సంస్థను 2023లో ఏర్పాటు చేసి, 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చీటీ వ్యాపారం ప్రారంభించాడు. ముందుగా సభ్యుల నుంచి 6 వేల రూపాయలు వసూలు చేసి, కేవలం 300 రూపాయల విలువ గల వస్తువులను 2 వేల విలువగా చూపించి అందజేశాడు. మిగతా డబ్బును లాభం పేరుతో తిరిగి చెల్లిస్తానని నమ్మబలికాడు. ఈ ముఠా గ్రామాల వారీగా ఏజెంట్లను నియమించి, ఇప్పటి వరకు 28,493 సభ్యత్వాలు నమోదు చేసి, ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున వసూలు చేసి మొత్తం రూ. 11 కోట్ల 39 లక్షలు సేకరించింది. అందులో వస్తువుల పేరుతో కేవలం రూ. 4 కోట్ల 84 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్నవి..

రూ. 5,92,000 నగదు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మెషిన్, చెక్‌ బుక్స్, స్టాంపులు, పొలాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు అలాగే నిందితులు వసూలు చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లు గుర్తించి, రూ. 5 కోట్ల 48 లక్షలు రూపాయలకు పైగా ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

అరెస్టైన నిందితులు..

ప్రస్తుతం పాలకుర్తి లో నివాసం ఉంటున్న, సూర్యాపేట జిల్లా కు చెందిన తెప్పాలి సైదులు,
మనుబోతుల రామకృష్ణ, పొడిల సురేష్‌కుమార్, పొడిల శ్రీధర్ లను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిపై గతంలోనే పది కి పైగా మోసం కేసులు ఉన్నాయని. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల డబ్బును దోచుకునే బోగస్ కంపెనీలకు బలి కావద్దని, పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.

పలుసెక్షన్స్ లో కేసు నమోదు..

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నం.216/2025 కింద మోసం కేసు కింద నమోదు అయింది. ఇందులో బీ ఎన్ ఎస్ చట్టంలోని సెక్షన్లు 318(4), 316(2), 316(5) r/w 61(2) తో పాటు, ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం–1978లోని సెక్షన్ 3, 4, 5 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం–1999లోని సెక్షన్ 5ను కూడా అమలులోకి తెచ్చారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు సేకరించి మోసం చేసిన వ్యక్తులపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రతిభ కనబరిచిన అధికారులు..

ఈ ఆపరేషన్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ జానకీరాం రెడ్డి, ఎస్‌ఐలు వంశీ కృష్ణ, దిలీప్ తదితరుల కృషిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.