epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు సూపర్‌ డూపర్‌ న్యూస్.. ఒకేసారి బ్యాంక్‌ అకౌంట్లోకి రూ.18వేలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6వేల ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అంటే ఈ మొత్తం నేరుగా రైతులు బ్యాంకు అకౌంట్లో జమ అవుతోంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను 2వేల చొప్పున జమ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ను చూద్దాం.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో 11వ విడత తర్వాత పీఎం కిసాన్ నుంచి ఎలాంటి డబ్బు అందని రైతులు దాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి మోదీ ఈ నెల ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడతను విడుదల చేశారు. అందువల్ల వాయిదా డబ్బులు రాకుండా నిలిచిపోయిన రైతులు డేటాను సరిదిద్దడం వల్ల 12 నుంచి 20వ విడత వరకు 18వేలు పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని పత్రాలను మళ్లీ ధ్రువీకరించుకోవాలి. ఆధార్ సీడింగ్, ఈకెవైసీ, ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ చెప్పారు. ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను వారికి ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వాయిదాల జారీ ఆగిపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు. 2022 ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇచ్చిన 12వ విడతలో రైతులు తప్పనిసరిగా భూమిలో విత్తనాలు వేశారని రుజువు చూపించాల్సి వచ్చింది. ఆ తరువాత, 2022 డిసెంబర్ నుండి 2023 మార్చి మధ్య ఇచ్చిన 13వ విడతలో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానంను అమలు చేశారు. 2023 ఏప్రిల్ నుండి జూలై వరకు వచ్చిన 15వ విడతలో అయితే e-KYC తప్పనిసరి చేశారు.

ఈ కొత్త సాంకేతిక విధానాల వలన, కొన్ని రాష్ట్రాల్లో రైతుల సంఖ్య తాత్కాలికంగా తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయానికి పూర్తికాకపోయిన రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించిందని స్పష్టం చేసింది. అయితే, తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో మాత్రం రైతులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు.

రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాలోకి చేరేలా ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానాన్ని అనుసరిస్తోంది. దీని కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ధృవీకరించబడిన రైతుల వివరాలను PM-Kisan పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.

పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సాంకేతిక సవరణలు చేసింది. ఇందులో ముఖ్యంగా :

PFMS, UIDAI, ఆదాయపు పన్ను శాఖల డేటాను కలపడం,

రైతుల వివరాలను రేషన్ కార్డ్ డేటాబేస్‌తో సరిపోల్చడం,

మరణించిన వారి ఆధార్ నంబర్లను నిలిపివేయడం,

డూప్లికేట్ లేదా నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించడం వంటి చర్యలు ఉన్నాయి.

ఈ మార్పుల వలన పథకం ద్వారా సహాయం నిజంగా అర్హులైన రైతులకే చేరేలా ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేసింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.