epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అధికారుల నిఘాలోనే పులి

అధికారుల నిఘాలోనే పులి
ట్రాప్ కెమెరాలు, సిబ్బందితో పర్యవేక్షణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, రేంజర్ డోలి శంకర్
కాకతీయ, ములుగు ప్రతినిధి: వారం రోజులుగా ములుగు జిల్లా పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు పాదముద్రలను స్థానికులు గుర్తిస్తున్నారు. జిల్లాలో పెద్దపులి మళ్లీ సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పులి చలనం పలు గ్రామాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం పత్తిపల్లి గ్రామ శివారు పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రేంజర్ డోలి శంకర్ పులి అడుగుజాడలను పరిశీలించి పత్తిపల్లి, చిన్న గుంటూరుపల్లి పరిసరాల్లో పులి సంచరిస్తోందని ధృవీకరించారు. స్థానికులు పులికి హాని తలపెట్టవద్దని, ఎలాంటి కదలికలు గమనించిన వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే పులి పాకాల రిజర్వ్ ఫారెస్ట్ నుండి పత్తిపల్లి ఎదల చెరువు, బుగ్గ చెరువు దాకా తిరుగుతూ కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. తరువాతి రోజుల్లో పులి పులిగుండం, జాకారం, సింగరకుంటపల్లి, తామరచెరువు మీదుగా నర్సాపూర్ పొలాలకు చేరిందని పాదముద్రలు ఆధారంగా అంచనా వేశారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో 20 మంది ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. పులి రామప్ప చెరువు మీదుగా వానలగుట్ట చేరినట్టు అధికారులు గుర్తించారు. అక్కడ గాండ్రింపులు వినిపించడంతో పశువులు భయంతో గ్రామాల వైపు పరుగులు పెట్టాయని పశువుల కాపరులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి కదలికలను ట్రాప్ కెమెరాలు, మానవ వనరుల ద్వారా నిఘాలో ఉంచామని అధికారులు వెల్లడించారు. పులి రక్షణతో పాటు ప్రజల భద్రతకూ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పులి సహజ వాతావరణంలోనే సంచరిస్తోందని, దానికి ఎటువంటి హాని జరగకుండా చూడటం తమ బాధ్యత అని ఎటువంటి హాని జరగకుండా చూడటం మా బాధ్యత ములుగు ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కదలిక గమనించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పులి సంచారాన్ని గమనిస్తుమని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందంతో పులిని పర్యవేక్షిస్తున్నామని ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ములుగులో పెద్దపులి ప్రవేశించినప్పటి నుండి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులిని అనుసరిస్తుమని, ట్రాప్ కెమెరాలతో పులి పాదముద్రల ఆధారంగా పులి సంచరించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పులి భద్రతకు ప్రాధాన్యవిస్తూ స్థానికులు, పశువులు, పశువుల కాపరులను హెచ్చరిస్తూ పులి కదలికలను గమనిస్తూనే ఉన్నామని డీఎఫ్ఓ చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.