epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
అభివృద్ధి పనుల భూ సేకరణ ప్రాధాన్యతగా పరిగణించాలి
మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి
మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై మంత్రి తుమ్మల స‌మీక్ష‌

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అభివృద్ధి పనులు నిర్ధిష్ట‌ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులపై నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ నడుస్తుందని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మొదటి ప్రాధాన్యతగా, కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు రెండవ ప్రాధాన్యతగా పెండింగ్ భూ సేకరణ త్వరగా క్లియర్ చేయాలని మంత్రి తెలిపారు. మున్నేరు నదికి ఇరు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం భూముల బదలాయింపు కోసం అడ్వాన్స్ పోజిషన్ వెంటనే అందించాలని సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను మంత్రి చరవాణిలో ఆదేశించారు.

మార్చిలోగా రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి

మార్చి 2026 నాటికి మున్నేరు నది రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని మంత్రి సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన టెక్నాలజీతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగాలని, హైదరాబాద్ దుర్గం చెరువు, కరీంనగర్ మానేరు నదిపై గతంలో కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయని, రాష్ట్రంలో 3వ కేబుల్ బ్రిడ్జి ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతుందని, కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైన పవర్ లైన్స్, విద్యుత్ స్తంభాల తరలింపు పనులు 15 రోజులలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి పైప్ లైన్, పవర్ లైన్ తరలింపు పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై లైటింగ్ అద్భుతంగా ఉండేలా చూడాలని, రాష్ట్రంలో 3 కేబుల్ బ్రిడ్జిలలో మన కేబుల్ బ్రిడ్జి ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని, దీనికి సంబంధించి అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్.టి.పి. నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలను ఒప్పించి భూ సేకరణ పూర్తి చేసి సంబంధిత ఏజేన్సీలకు త్వరగా భూమి అప్పగించాలని అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, ఇరిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ ఈ యాకోబు, విద్యుత్ ఎస్ఇ, తహసీల్దార్ లు రాంప్రసాద్, సైదులు, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.