epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా?
గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు
విమాన గోపురం బంగారు తాపడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు
100 కిలోల బంగారంలో సగం మాయమైందన్న ఫిర్యాదులు
9 పొరల బదులు 2 పొరలతోనే పనులు పూర్తి చేసినట్లు అభియోగం
టీటీడీ విజిలెన్స్ గోప్య విచారణ… జనసేన ఆందోళన

కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీటీడీపై ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2022–23 మధ్యకాలంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ పనుల కోసం సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించడంతో పాటు 4,300 కిలోల రాగిని వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. గోపురానికి 9 పొరల బంగారు తాపడం చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం 2 పొరలతోనే పనులు ముగించి దాదాపు 50 కిలోల బంగారాన్ని మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల కాంట్రాక్టును జ్యోతి అనే మహిళ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఆమె స్వయంగా పనులు చేయకుండా ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్యమతస్తులైన సయ్యద్ కరీం, రహంతుల్లాకు పనులు అప్పగించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ విమాన గోపురం వంటి పవిత్ర పనులను ఇలా సబ్‌లీజ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది.

విగ్రహాల ధ్వంసంపై ఆవేదన
బంగారు తాపడం పనుల సమయంలో గోపురంపై ఉన్న 30కి పైగా పురాతన దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అప్పట్లోనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. విగ్రహాల ధ్వంసం అనంతరమే తాపడం పనులు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
విమాన గోపురం పనులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. అసలు కాంట్రాక్టర్, సబ్‌కాంట్రాక్టర్లు, పనులు చేసిన కార్మికులను విచారిస్తూ ఎంత బంగారం వినియోగించారన్న అంశంపై ఆరా తీస్తోంది. అయితే ఈ విచారణ అంతా అత్యంత గోప్యంగా సాగుతుండటంతో ఇప్పటివరకు టీటీడీ అధికారికంగా స్పందించలేదు.

జనసేన ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వామివారి ఆస్తులను స్వాహా చేశారంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీటీడీ ఇచ్చిన 100 కిలోల బంగారంలో సగం మాయమైందని, బంగారం బదులు గోల్డ్ కలర్ పెయింట్ మాత్రమే వేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. బంగారు తాపడం పేరుతో వాడిన బంగారం నిజమైనదేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. శ్రీవారికి అన్నగా భావించే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన ఈ ఆరోపణలు భక్తుల్లో తీవ్ర కలవరం రేపుతున్నాయి. విజిలెన్స్ విచారణలో వాస్తవాలు బయటపడాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.