epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతు భరోసాకు కొత్త నిబంధనలు!

రైతు భరోసాకు కొత్త నిబంధనలు!
సాగులో ఉన్న భూములకే ఇక సాయం
శాటిలైట్ సర్వేతో సాగులో లేని 20 లక్షల ఎకరాలు గుర్తింపు
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధుల జమ చేసేందుకు ప్ర‌య‌త్నం
అర్హులైన‌ రైతులకే లబ్ధి లక్ష్యంగా ప్రభుత్వం చ‌ర్య‌లు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు భూమి పేరుపై నమోదైన ప్రతి ఎకరానికి సాయం అందిస్తుండగా, ఇకపై నిజంగా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో, త్వరలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గతంలో సాగు చేయని భూములు, కొండలు–గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, జాతీయ రహదారుల పరిధిలోని భూములకు కూడా పెట్టుబడి సాయం వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శల నేపథ్యంలో, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆధునిక శాటిలైట్ సాంకేతికతతో సర్వే నిర్వహించారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీ ద్వారా జరిగిన ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాల భూమిని పరిశీలించగా, దాదాపు 20 లక్షల ఎకరాల్లో అసలు పంటల సాగు జరగడం లేదని తేలింది. దీంతో ఈ భూములకు ఇకపై రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధులు

రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ.9,000 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే నిధుల జమ ఆలస్యం అవుతోందని, ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే అర్హులైన 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6,000 చొప్పున నేరుగా నగదు జమ అవుతుందని సీఎం హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలోనూ వెరిఫికేషన్

శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించిన వివరాల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, నిజంగా సాగులో లేని భూములను తుది జాబితా నుంచి తొలగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు, ఫామ్ హౌస్‌లు, నివాస ప్రాంతాలుగా మారిన స్థలాలను కూడా ఈ జాబితా నుంచి తప్పిస్తున్నారు. కేవలం పంటలు పండించే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని, ఆ మొత్తాన్ని నిజమైన రైతుల సంక్షేమానికి మరింత సమర్థంగా వినియోగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా పథకంలో తీసుకొస్తున్న ఈ మార్పులు పారదర్శకతకు, న్యాయమైన లబ్ధి పంపిణీకి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.