epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!

11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!
రాజ‌కీయ ముసుగులో అరాచ‌కాలు స‌హించం
చందాలు, దందాలు చేస్తే కఠిన చర్యలు
బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదు
కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపిస్తా
ఏదులాపురం ప్రచార ముగింపులో మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

కాకతీయ, కూసుమంచి : రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే ఇక సహించేది లేదని, ఎన్నికలు ముగిసిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించారు. ఎవరైనా ఫోన్లలో బెదిరింపులకు దిగినా, రాజకీయాల పేరుతో దౌర్జన్యాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “11వ తేదీ తర్వాత పరిస్థితి మారిపోతుంది. చందాలు, దందాలు చేస్తే కిందపడుద్ది జాగ్రత్త. తింగరి వేషాలు వేస్తే ఊరుకోం… నేరుగా బొక్కలోకి పంపిస్తాం” అని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దందాలకు ఇక కాలం చెల్లింది

ప్రచార సమయంలో ప్రత్యర్థులు చేస్తున్న బెదిరింపులపై మంత్రి మండిపడ్డారు. “కారుకూతలు కూస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని తేల్చిచెప్పారు. ఎన్నికలను అడ్డంపెట్టుకుని పాత అలవాట్లు కొనసాగిస్తే కఠిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల హామీలపై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. అధికారం లేకుండా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసమే” అని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు కొత్తగా నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరే పనులే తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.

ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇళ్లు

వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచిందని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడుపేట సర్కిల్ వరకు జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.