epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యలో విప్లవానికి శ్రీకారం!

విద్యలో విప్లవానికి శ్రీకారం!
“ప్రభుత్వ బడిలో చదవడం మా అదృష్టం” అనిపించేలా మార్పులు
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి… భారీ నిధుల కేటాయింపు
అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా 100 ‘యంగ్ ఇండియా’ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి
విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలని పిలుపు

కాకతీయ, బోనకల్ : “భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదృష్టం అని విద్యార్థులు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని తేళ్ల వసంతయ్య స్మారక టీవీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల 48వ వార్షిక సంచికను ఆవిష్కరించి, విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యాబోధన జరిగే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ భారత నిర్మాణానికి పునాదులు వేసే విజ్ఞాన కేంద్రాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారా సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని ఆయన తెలిపారు.

అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ విద్యా విధానం అమలు, తాగునీటి సౌకర్యం, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీలు వంటి సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ స్థాయిలో ‘యంగ్ ఇండియా’ స్కూల్స్

తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా రాష్ట్రవ్యాప్తంగా 100 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన బోధనతో ఈ పాఠశాలలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాయని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని, అందుకే విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాలకు, సమాజానికి తిరిగి ఏమి చేయగలరో ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు. తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకువచ్చి నేటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. విద్యార్థులను భావి భారత మార్గదర్శకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో విలువలు, సంస్కారం, బాధ్యతాభావాన్ని పెంపొందించాలని సూచించారు. పాఠశాల దశలోనే నైతిక విలువలు బలపడితేనే భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా ఎదగగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.