మానవత్వాన్ని చాటుకున్న వెల్లంపల్లి శరత్ బాబు
వైద్య ఖర్చులకు లక్షకు పైగా సాయం
కాకతీయ, కూసుమంచి : కష్టకాలంలో సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు వెల్లంపల్లి శరత్ బాబు. గ్రామానికి చెందిన ఏఈఓ గుగ్గిళ్ళ వంశీ చికిత్స కోసం ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారు.
గట్టుసింగారం గ్రామానికి చెందిన ఏఈఓ గుగ్గిళ్ళ వంశీ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెల్లంపల్లి లక్ష్మీకాంతమ్మ–భద్రయ్యల కుమారుడు శరత్ బాబు, కుమార్తె శ్రీదేవితో కలిసి విరాళాలు సేకరించారు. మానవతా దృక్పథంతో సేకరించిన రూ.1,04,100 మొత్తాన్ని వంశీ భార్యకు అందజేశారు. కష్ట సమయంలో అండగా నిలిచిన వెల్లంపల్లి కుటుంబానికి వంశీ సతీమణి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా భావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

