భూముల ఆక్రమణలకు నిరసనగా బంద్కు పిలుపు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో స్థానికుల భూములను కొందరు ఆక్రమణదారులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భూముల రక్షణ కోసం చేపడుతున్న పోరాటానికి మద్దతుగా మంగళవారం మండల కేంద్రంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, స్థానికుల హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భూముల ఆక్రమణలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటేశ్వర్లు, రంగయ్య, బండారు లక్కీ, సరికొప్పుల శ్రీనివాస్, ఫయాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బంద్కు మద్దతు తెలపాలని వారు కోరారు.

