టికెట్ ఇచ్చేది అధిష్ఠానమే.. వ్యక్తులు కాదు
రాజ్గోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెల్ ఆగ్రహం
తుంగతుర్తి టికెట్పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే
కాకతీయ, హైదరాబాద్ : తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధిష్ఠానమే తప్ప ఏ వ్యక్తి కాదని, తుంగతుర్తి టికెట్ విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్గోపాల్రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్లో చేరారని, ఆయన కంటే ముందే తాను కాంగ్రెస్లో చేరినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏఐసీసీకే ఉంటుందని స్పష్టం చేశారు. తన విజయంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని సామెల్ పేర్కొన్నారు. రెడ్లు, దళితులతోనే రాజకీయం నడవదని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ అని, రాజ్గోపాల్రెడ్డి కాదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి వచ్చిన కోమటిరెడ్డి ఒక్క మాట కూడా తనతో మాట్లాడలేదని సామెల్ తెలిపారు. మునుగోడులో కూడా తనకు క్యాడర్ ఉందని, అక్కడ రాజ్గోపాల్రెడ్డిని గెలిపించినందుకు తన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

