epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పైసలిస్తేనే పని.. లేదంటే ఫైలు పెండింగ్‌

పైసలిస్తేనే పని.. లేదంటే ఫైలు పెండింగ్‌
మ్యుటేషన్‌ నుంచి వారసత్వ మార్పిడి వరకు ఇదే క‌థ‌
ధ్రువీకరణ పత్రాలకూ ‘రేటు’
భూమి వ్యవహారాల్లో మధ్యవర్తుల హవా
తనిఖీలు ఉన్నా.. తగ్గని వసూళ్లు
జ‌న‌గామ‌లో బాధితులకు ముప్ప‌తిప్ప‌లు

కాక‌తీయ‌,నిఘా ప్ర‌తినిధి : జ‌న‌గామ జిల్లాలోని మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొన్ని పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పూర్తి కావాల్సిన పనులు సైతం ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం.. పైసలు ముట్టజెప్పిన తర్వాతే కదిలించడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూముల మ్యుటేషన్‌, వారసత్వ మార్పిడి, పట్టాదారు పాస్‌బుక్‌ సంబంధిత పనులు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తదితర సేవల్లో అక్రమ వసూళ్లకు ఆస్కారం ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుల్లో చిన్నచిన్న లోపాలను చూపుతూ ప్రజలను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పడం.. మధ్యవర్తుల ద్వారా పని చేయించుకుంటే మాత్రం త్వరగా పూర్తిచేయడం జరుగుతోందని పలువురు చెబుతున్నారు.

భూమి పనులకే ఎక్కువ డిమాండ్‌

రెవెన్యూ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన వ్యవహారాలే ప్రధానంగా అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూమిని కుటుంబ సభ్యుల పేర్లపై మార్చడం, రికార్డుల్లో మార్పులు చేయడం, భూ వివరాల పరిశీలన, ధ్రువీకరణ, వివిధ రకాల నివేదికల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ‘ఖర్చులు’ పేరుతో డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పని ఆలస్యమవుతుందని చెప్పి ఒత్తిడి చేయడం.. చివరకు ఎంతోకొంత ఇచ్చిన తర్వాత ఫైలు ముందుకు కదులుతుందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే మధ్యవర్తుల వ్యవస్థ కూడా అవినీతికి ఊతమిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు నేరుగా అందాల్సిన సేవలకు కూడా మధ్యవర్తుల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. దరఖాస్తు నుంచి ఫైలు క్లియరెన్స్‌ వరకు ఒక్కో దశకు ఒక్కో రేటు నిర్ణయించినట్లుగా వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీలు ఉన్నా.. తగ్గని వసూళ్లు

రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలకు అందాల్సిన సేవలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో అందించడంతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బంది, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పరిశీలించి, ప్రతి సేవకు నిర్ణయించిన రుసుము, సమయ పరిమితిని కార్యాలయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.