epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

20 మంది మావోయిస్టులు మృతి

20 మంది మావోయిస్టులు మృతి

ద‌ద్ద‌రిల్లిన దండ‌కార‌ణ్యం
బీజాపూర్​లో మరోసారి భారీ ఎదురుకాల్పులు
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీక‌ర ఎన్‌కౌంట‌ర్‌
న‌క్స‌ల్స్ ఏరివేతే ల‌క్ష్యంగా రెండు రోజులుగా ఆప‌రేష‌న్
మృతుల్లో పీఎల్‌జీఏ 2 క‌మాండ‌ర్ వెల్ల మోడియం ?
మావోయిస్టుల మృతదేహాలతోపాటు
పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రి స్వాధీనం
మావోయిస్టు పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంట‌ర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ప్రారంభమైన భారీస్థాయి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని పోలీసులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 19 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. భద్రతా దళాలకూ భారీ నష్టం సంభవించింది. ముగ్గురు డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) జవాన్లు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

పార్టీకి కోలుకోలేని దెబ్బ

మరోవైపు ఈ సంవత్సరంలోనే మావోయిస్టు పార్టీ ఛీఫ్ నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజ్‌తోపాటు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్​, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా లాంటివారు మృతి చెందడం అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోవడం చంద్రన్న, బండి ప్రకాశ్​ అనారోగ్య కారణాలతో సాయుధమార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడం లాంటి ఘటనలు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. దీంతో నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం నేడు తీవ్ర ఒడిదొడుకులకు గురవుతోంది. ఆపరేష్ కగార్ నేపథ్యంలో వరుస ఎన్​కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అనేకమంది పార్టీ అగ్రనేతలే ఉద్యమాన్ని వీడుతున్నారు. దండకారణ్యంలో మనలేని పరిస్థితుల్లో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జనవరి 1న ఒకేసారి లొంగిపోతామని లేఖ

కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ జోన్‌ ప్రతినిధి అనంత్‌ అనే పేరుతో వారు ఓ లేఖను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలైన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు, గెరిల్లా వ్యూహకర్త హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ మరింత బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి, భద్రతాబలగాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని మావోలు కోరారు. జోన్‌లో ఎలాంటి అరెస్టులు కానీ ఎన్‌కౌంటర్‌లు, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని వారు తమ లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈనేప‌థ్యంలో తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డం.. 19 మంది మావోయిస్టులు మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.