epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?

ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?
సోనియా–రాహుల్ భజన తప్ప దేశభక్తి లేదా?
విదేశీ సిద్ధాంత బానిసత్వానికి కూనంనేని మాటలే నిదర్శనం
మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ… దేశ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిని గౌరవించలేని రాజకీయ ఆలోచన ప్రజాస్వామ్యానికి ప్రమాదమని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన తప్ప దేశ గౌరవం తెలియని రాజకీయమే కూనంనేనిదని విమర్శించారు. విదేశీ సిద్ధాంతాలకు బానిసలై, పక్క పార్టీలకు సొత్తులా మారిన నేతలు దేశభక్తిపై మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేగా, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి… దేశ ప్రధాని మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.

పేరు మార్పు కాదు… పేదల తలరాత మారే చట్టం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్‌గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టంపై ప్రతిపక్షాలు కావాలనే అపోహలు సృష్టిస్తున్నాయని నెల్లూరి ఆరోపించారు. పేరు మార్చారని మాత్రమే గగ్గోలు పెడుతున్నారని, కానీ ఇందులో దాగున్న పేదల భవిష్యత్తు మార్పును గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచి పేదలకు మోదీ గ్యారెంటీ ఇచ్చారని గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు ఢిల్లీ నుంచి వస్తున్నాయన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, గ్రామ సభలు–పంచాయతీలే తమ అవసరాలను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ఈ చట్టం కల్పించిందని స్పష్టం చేశారు.

రైతులు–కూలీల సమతుల్యతకు కేంద్ర నిర్ణయాలు

వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించిందని తెలిపారు. అందుకే విత్తనాలు నాటే సమయంలో లేదా కోతల కాలంలో ఏడాదికి 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. దీని వల్ల రైతులు, కూలీల మధ్య సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. దీని ద్వారా వారికి సకాలంలో వేతనాలు, మెరుగైన శిక్షణ లభిస్తుందని తెలిపారు.

క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదు

గ్రామాల్లో మౌలిక వసతులు, మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని నెల్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం, వేతనాల ఆలస్యానికి పరిహారం వంటి నిబంధనలను బలోపేతం చేసిన విషయాన్ని కూనంనేని తెలుసుకోవాలని సూచించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు సుదర్శన్ మిశ్రా, బండారు నరేష్, వీరవల్లి రాజేష్, నెల్లూరు బెనర్జీ, రవి రాథోడ్, రవి గౌడ్, గడిల నరేష్, కోట మూర్తి, అల్లిక అంజయ్య, మనీ, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.