యువ పార్లమెంటులో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్లో నిర్వహించిన యువ పార్లమెంట్ కార్యక్రమంలో టీజీఎంఎస్ నెల్లికుదురు పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయులు జి. ఉపేందర్ రావు తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఈఓ సత్యనారాయణ మూర్తి అనుమతితో.. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో డి.వై.ఎస్.ఓ ఒలేటి జ్యోతి పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. ఇందులో నెల్లికుదురు మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థిని ప్రవస్థిని పార్లమెంట్ స్పీకర్గా, హాసిని మానస్వి మరియు 7వ తరగతి విద్యార్థిని సిరివెన్నెల ప్రతిపక్ష సభ్యులుగా పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన సోషల్ టీచర్ అంజుమ్ సుల్తానాను ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

