epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగా బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజలకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని గుర్తు చేశారు.

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుండి సన్నబియ్యం పంపిణీ వరకు అనేక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కామారెడ్డి లో జరిగే భారీ బహిరంగ సభలో లక్షల మంది పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటుతారని అన్నారు.

ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఓటు చోరీలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నారని తెలిపారు. మోదీ, అమిత్ షా పదవే పరమావధిగా భావించి ఓటు దోపిడీకి పాల్పడతారని, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో దానికి ఉదాహరణ ఉందని అన్నారు. నైతిక విలువలు లేని ఈ చర్యలను రాహుల్ గాంధీ ఎప్పటికీ సహించరని స్పష్టం చేశారు. ఓటు చోరీల వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

ఉద్యోగాల విషయమై బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగాల కల్పన పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించగానే బీజేపీ నాయకులు దేవుళ్ల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతారని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దేవుళ్ల పేర్లు వాడి గెలిచారని, కానీ దేవుళ్లకు బీజేపీ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని గట్టి విమర్శలు చేశారు.

2029 ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు. కవిత స్టేట్‌మెంట్‌తో కేసీఆర్ కుటుంబం దోపిడీ బట్టబయలైందని, కేసీఆర్ కుటుంబం దొంగల ముఠాగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తిందని ఎద్దేవా చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ప్రజలతో ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని, మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపమని కొనియాడారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.