epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మార్వో ఆఫీసులో ప్రైవేటు రాజ్యం..!

  • ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూభారతి రిజిస్ట్రేషన్లు..?
  • ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు?
  • అడిగినంత ఇవ్వకపోతే ‘సర్వర్ పనిచేయడం లేదు’ అంటున్నారంటున్న రైతులు
  • అధికారుల సాక్షిగానే వసూళ్ల దందా సాగుతోందని తీవ్ర ఆరోపణలు

కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నిర్వహించాల్సిన భూభారతి రిజిస్ట్రేషన్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కార్యాలయ వ్యవహారాలు నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వరకు ప్రైవేటు వ్యక్తులే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్ స్లాట్‌కు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని, అడిగినంత చెల్లించని వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారనే ఫిర్యాదులు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ దందా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు… జిల్లా కేంద్రంలోని ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలోనే అధికారుల ఎదుటే సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘కాకతీయ’ ప్రత్యేక కథనం.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూభారతి..!

గతంలో ధరణి పోర్టల్ అమలుపై అనేక విమర్శలు, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పారదర్శకత లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయనే విమర్శల నేపథ్యంలోనే కొత్త విధానాన్ని అమలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో మాత్రం భూభారతి పోర్టల్ ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ నిర్వహించాల్సిన అధికారిక ఆపరేటర్ స్థానంలో ఓ ప్రైవేటు వ్యక్తి కూర్చొని భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ వద్ద భూభారతి పోర్టల్‌ను ఆ వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందా? లేక వారి దృష్టికి రాకుండానే కొనసాగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డిజిటల్ కీ లేకుండా ఎలా..?

భూభారతి పోర్టల్‌లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారుల లాగిన్ వివరాలు, డిజిటల్ కీ అవసరం. అలాంటప్పుడు ఓ ప్రైవేటు వ్యక్తి పోర్టల్‌లోకి ఎలా ప్రవేశిస్తున్నాడు? ఎవరి అనుమతితో ఈ వ్యవహారం కొనసాగుతోంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించాల్సిన విధులను అనధికార వ్యక్తులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే, అది అత్యంత తీవ్రమైన పరిపాలనా వైఫల్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్వో కార్యాలయంలో కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన మాన్యువల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ ఫైళ్లు, రికార్డు రూమ్‌లోని కీలక పత్రాలు భద్రపరిచి ఉంటాయి. అలాంటి రికార్డులకు కూడా ప్రైవేటు వ్యక్తులు చేరువవుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. భూ రికార్డుల నకళ్లు అనధికారంగా బయటకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొందరు రైతుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో రేటా..?

భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే రైతుల నుంచి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో మొత్తం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువను బట్టి రేట్లు నిర్ణయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అడిగినంత చెల్లించిన వారి పనులు వేగంగా పూర్తవుతుండగా, డబ్బులు ఇవ్వని వారికి “సర్వర్ పనిచేయడం లేదు”, “సిస్టమ్ స్పందించడం లేదు” అంటూ రోజులు తరబడి తిప్పుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరిగే వసూళ్ల వ్యవహారం వెనుక కొందరు అధికారులు ఉన్నారనే ఆరోపణలు కూడా రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ద్వారా వచ్చిన డబ్బులు కొందరు అధికారులకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

వైరల్ వీడియోతో కలకలం

భూభారతి పోర్టల్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంపై తీవ్ర చర్చ మొదలైంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగినా? కాంట్రాక్టు సిబ్బందా? లేక పూర్తిగా ప్రైవేటు వ్యక్తినా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చిన ప్రభుత్వ లక్ష్యం పారదర్శకతను పెంచడమే. అలాంటి వ్యవస్థ అమలులోనే ప్రైవేటు వ్యక్తుల జోక్యం, వసూళ్ల ఆరోపణలు వినిపించడం రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిగితేనే ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో, భూభారతి వ్యవస్థలో అనధికార జోక్యం ఎలా జరిగిందో తేలే అవకాశం ఉందని వారు అంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.