epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఎగిరెగిరిపడితే ప్రజలు వాత పెడ్త‌రు

నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది

రేవంత్ రెడ్డి ధమ్కీలు తెలంగాణ‌లో న‌డ‌వ‌య్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్‌ను గెలిపించండి

గోపన్నపై అభిమానాన్ని మరోసారి చాటిచెప్పాలి

రహమత్‌నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని తెలిపారు. రేవంత్‌ రెడ్డిలాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు. జూబ్లీహిల్స్‌ రహమత్‌నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ప్రజలంటే మాగంటి గోపీనాథ్‌ (గోపన్న)కు ఎంతో అభిమానం ఉండేదని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. గోపన్నపై అభిమానాన్ని మరోసారి జూబ్లీహిల్స్‌ ప్రజలు చాటిచెప్పాలని కోరారు. ప్రతిభానగర్‌ నుంచి రెహమత్‌ నగర్ వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. 2023లో అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్‌ నగరే అని గుర్తుచేశారు. ఈసారి 12వేల మెజార్టీ రెహమత్‌ నగర్‌ నుంచి వస్తుందని అనిపిస్తోందని తెలిపారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్‌ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్‌ అని అన్నారు.

గోపీనాథ్‌ అకాల మరణం తీరని లోటు

గోపీనాథ్‌ అకాల మరణం తీరని లోటు అని కేటీఆర్‌ అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. రెండేండ్ల రేవంత్‌ రెడ్డి ఒక్క మంచి పని చేశాడా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్‌ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు. మహామహులకు బుద్ధి చెప్పిన ఘనత తెలంగాణ గడ్డదని వ్యాఖ్యానించారు.

అడ్డగోలు హామీలిచ్చి మోసం

అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. పథకాలను రద్దు చేస్తానని రేవంత్‌ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు. అసలేం పథకం ప్రారంభించావ్‌ రేవంత్‌ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్‌ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా అని అడిగారు. స్పెషల్‌ ఉర్దూ డీఎస్పీ నిర్వహిస్తామన్నాడు ఏమైందన్నారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్‌ రెడ్డిని గెలిపించారని చెప్పారు. సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. కేవలం 500 రోజుల సమయమే ఉందని తెలిపారు. 500 రోజుల తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్‌ తిరిగి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్‌ పేరు పెడతామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి...

ప‌ల్లె పోరు షూరు

ప‌ల్లె పోరు షూరు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వేఢీ ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో 1224...

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట వచ్చే నెల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.