epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం!
ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం
లౌకిక దేశంలో మోదీ–అమిత్ షాల పప్పులు ఉడకవు
రాజ్యాంగంపై కుట్రలు జ‌రుగుతున్నాయి..
కేంద్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి
టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌
అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

కాకతీయ, హైదరాబాద్ : మహాత్మా గాంధీ పేరు పలికితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఉలుకే పరిస్థితి ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌ ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో శనివారం ఎంజీ రోడ్డులో నిర్వహించిన నిర‌స‌న‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీ కుటుంబం పేరు వింటే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. గాడ్సేను పూజించే వారు కావడంవల్లే గాంధీ పేరును తొలగించాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది సోనియా గాంధీయేనని గుర్తు చేశారు. పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించిన ఈ పథకానికి 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ వస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరన్నారు.

రాజ్యాంగంపై కుట్రలు
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగం చేస్తోందని ఆరోపించారు. గాంధీ–నెహ్రూ వారసత్వాన్ని మరిపించాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు. లౌకిక దేశంలో మోదీ, అమిత్ షాల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

అధికారం ఉందని దుర్మార్గపు నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రతి భారతీయుని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. కరువు కాటకాలు, ఆర్థిక కష్టాల సమయంలో అట్టడుగు పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి, గౌరవాన్ని కల్పించిన ఈ గొప్ప పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఉన్న రాజకీయ కక్షతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు గ్రామాలు, ప్రజలు ఏకం కావాలని జూపల్లి పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అన్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.