epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’

అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’
గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు
స్థానిక బీటీపీఎస్ లో యువతకు అవకాశాలు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కాకతీయ, పినపాక: అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అప్పులకు వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని గ్రామం అంటూ తెలంగాణలో లేదన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసే వారమన్నారు. కానీ బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించామని తెలిపారు. కావాలని కోర్టుకు వెళ్లి బీసీలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు. అనంతరం జానంపేట ఎస్సీ కాలనీ నుండి 40 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. దళిత కాలనీలో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధన ప్రవాహంతో గత బిఆర్ఎస్ నాయకులు ఏమి చేయాలో పాలు పోక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు.

ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ప్రతిపక్షాల నోరుమూయించాలన్నారు. అనంతరం జానంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఇల్లు రాని ప్రతి పేదవాడికి ,అర్హుడికి ఇల్లులు రెండో విడతలో కేటా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు బోడ రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోజ్, మాజీ ఎంపీటీసీ హరీష్, కాంగ్రెస్, నాయకులు పేరం వెంకటేశ్వర్లు, రాజేష్, చందర్రావు, లక్ష్మణ్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోకల కేశవులు, సుంకరి , కేత ప్రసాదు, స్వతంత్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.