epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా…?

పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా…?
కమలాపురం గ్రామంలో చెత్త కుప్పలు.
నెలల తరబడి చెత్త సేకరణ నిలిపివేత..
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

కాకతీయ, ములుగు ప్రతినిధి: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి రోజు రోజుకు మరింత క్షీణిస్తోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, మలిన గల్లీలు, పంచాయతీ కార్యాలయం పరిసరాలు చెత్త కుప్పలతో నిండిపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాస్టిక్‌, గృహ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో వాతావరణం కలుషితం అవుతుండగా, చెత్త గుట్టల్లో కోతులు, పందులు తిరగడం గ్రామపాలన దయనీయ స్థితిని బయటపెడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెలల తరబడి చెత్త సేకరణ జరగకపోవడంతో రోడ్ల వెంట చెత్త గుట్టలుగా పేరుకుపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిల్వ మురుగుతో దోమల బెడద… వ్యాధుల భయం

చెత్త సేకరణ సరిగా జరగక పోవడం వల్ల కాల్వలు మూసుకుపోయి మురుగు నీరు నిల్వ ఉండటం గ్రామంలో దోమల పెరుగుదలకు కారణమైందని నివాసితులు చెబుతున్నారు. దుర్వాసనతో గల్లీల్లో నడవడం కష్టంగా మారిందని, చిన్న పిల్లలు, వృద్ధులు తరచూ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వారు వెల్లడించారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ కూడా చెత్త పేరుకుపోవడం గ్రామపాలన వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా..? గ్రామస్థుల ప్రశ్న…

గ్రామ పరిశుభ్రత పై బాధ్యత వహించాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఇళ్లలోని చెత్తను వారానికి ఒకసారి అయినా సేకరించడంలేదని, గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్త రోడ్లపై పేరుకుపోతుందంటున్నారు. గ్రామ సమస్యలు,మురుగు, మానసునీరు, వీధిలైట్లు ఏ అంశంపై కూడా స్పందించకపోవడంతో “కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా..?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీ కార్యాలయం చుట్టూ చెత్త గుట్టలే కనిపిస్తున్నా కార్యదర్శికి కనబడకపోవడం బాధాకరమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

23 మంది మల్టీ పర్పస్ వర్కర్లు… అయినా పరిశుభ్రత నామమాత్రం..

కమలాపురం గ్రామపంచాయతీలో 23 మంది మల్టీ పర్పస్ వర్కర్లు ఉన్నప్పటికీ గ్రామంలో ఎక్కడా శుభ్రత కనిపించడం లేదని నివాసితులు విమర్శిస్తున్నారు. కాలనీల్లో చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయిందని, నెలల తరబడి చెత్త తొలగించే దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వర్కర్లు, అధికారులు సరిగా పని చేయకుండా వదిలేయడం వల్ల గ్రామం మొత్తం చెత్తతో నిండిపోయిందని వారు ఆరోపిస్తున్నారు.

కాకతీయలో వార్త వచ్చినా స్పందన లేనట్టా

కమలాపురం పరిశుభ్రతపై శనివారం కాకతీయ దినపత్రికలో వార్త ప్రచురితమైనప్పటికీ పంచాయతీ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అసహనానికి దారితీసింది.
గత రెండు రోజులుగా కూడా చెత్త తొలగించే ప్రయత్నాలు కానరాకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుందని గ్రామస్థులు అంటున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడుతున్నా సంబంధిత శాఖలు కనీస స్పందన చూపకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత సమస్యను వెంటనే పరిష్కరించాలని, పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పారిశుధ్యం పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం- మంగపేట ఎంపీఓ శ్రీనివాస్.

మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో పారిశుధ్య సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి పారిశుధ్యం పై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.