epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ. 1000 తగ్గించారు

రూ. 1000 తగ్గించారు
ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లలో కొత్త లెక్క‌లు
కాకతీయ వరుస కథనాలతో ఇసుకాసురుల్లో అలజడి
రూ. 5600 నుంచి రూ. 4500కు మార్పు
చర్యలకు, తనిఖీలకు మంగళం పాడిన టీజీఏండీసీ
వంత పాడటంలో ఆంతర్యం ఏమిటి

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు రూపం మార్చుకున్నాయే తప్ప ఆగలేదు. ‘మీ కోసమే వెయ్యి రూపాయలు తగ్గించాం’ అంటూ కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్లను మభ్యపెడుతూ కొత్త వసూళ్ల పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ వరుస కథనాలతో ఏర్పడిన ఒత్తిడికి తాత్కాలికంగా వసూళ్ల మొత్తాన్ని తగ్గించినా, అసలు అక్రమ వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక్కో లారీపై రూ.5600 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు మొత్తం రూ.4500కు పరిమితం చేశారు. లోడింగ్ పేరుతో రూ.2500, పట్టా (పర్దా) పేరుతో రూ.1500, జేసీబీకి రూ.200, ఇసుక లెవలింగ్‌కు రూ.300 వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ర్యాంపులో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏదో ఒక పేరుతో డబ్బులు చెల్లించకపోతే లోడింగ్ జరగదన్న పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టా పేరుతో వసూలు… కప్పడం మాత్రం లేదు!

అక్రమ వసూళ్లలో మరో కొత్త మాయ బయటపడింది. పట్టా పేరుతో రూ.1500 వసూలు చేస్తున్నప్పటికీ లారీలపై ఇసుక కప్పకుండా ర్యాంపుల నుంచి పంపిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దీని వల్ల రహదారులపై ఇసుక చల్లరేగి ప్రమాదాలకు దారి తీస్తోందని, వెనుక వస్తున్న వాహనదారులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటే సేవ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలపై కాకతీయ వరుస కథనాలు ప్రచురించడంతో నిర్వాహకుల్లో కలకలం మొదలైంది. ఈ కథనాల ప్రభావంతోనే వసూళ్ల మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించినట్లు డ్రైవర్లే చెబుతున్నారు. “వార్తలు వచ్చాయి కాబట్టే ఇప్పుడు తగ్గించారు… మళ్లీ కొద్ది రోజుల్లో పెంచుతారు” అంటూ ఒక లారీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లు టీజీఏండీసీ సిబ్బంది ముందే జరుగుతున్నాయా? అన్న ప్రశ్నకు “అందరికీ తెలిసే జరుగుతోంది” అని డ్రైవర్లు చెప్పడం మరింత సంచలనంగా మారింది.

చర్యలకు దూరంగా టీజీఏండీసీ?

ఇసుక ర్యాంపుల్లో బహిరంగంగా డబ్బులు వసూలవుతున్నా టీజీఏండీసీ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన శాఖ పూర్తిగా మౌనం వహిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల మొత్తాన్ని మార్చడమే చర్యలుగా భావిస్తున్నారా? లేక కాంట్రాక్టర్లకు మౌన మద్దతు ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు లారీ డ్రైవర్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై వివరణ కోరేందుకు కాకతీయ టీజీఏండీసీ పీఓను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.