epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రితో కాగితాల‌కే ప‌రిమితం
ఆన్‌లైన్ అడ్డంకులు రాజ్యాంగ విరుద్ధం
హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : విద్య హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేటెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య హక్కు నిబంధనలకే పరిమితం కాకుండా, భూమిపై అమలయ్యే మౌలిక హక్కుగా ఉండాలనే స్పష్టమైన సందేశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద ప్రైవేటు, ప్రభుత్వ సహాయం లేని పాఠశాలల్లో పేద కుటుంబాల పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఇది దయాదాక్షిణ్యం కాదని, రాజ్యాంగబద్ధమైన మౌలిక హక్కు అని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని తెలిపారు. ఈ తీర్పు రెండు వేల ఇరవై ఆరు–ఇరవై ఏడు విద్యా సంవత్సరపు అడ్మిషన్ల నుంచే అమలులోకి రావాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేయలేదనే కారణంతో పేద పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థికి రైట్ టు ఎడ్యుకేషన్ కోటాలో సీటు నిరాకరించిన ఘటన నుంచే ఈ వ్యవహారం దేశవ్యాప్త సమస్యగా మారిందని తెలిపారు. డిజిటల్ అజ్ఞానం, భాషా అడ్డంకులు, సమాచారం లోపం కారణంగా పేద పిల్లలు హక్కు కోల్పోతున్నారని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిందన్నారు.

సామాజిక మార్పుకు విద్యే పునాది

రెండు వేల తొమ్మిదిలో అమలులోకి వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం, ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలుడికి ఉచిత, తప్పనిసరి విద్యను హామీ ఇస్తుందని మారెళ్ళ విజయకుమార్ గుర్తు చేశారు. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలు తమ మొదటి తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సీట్లకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. విభిన్న వర్గాల పిల్లలు ఒకే తరగతిలో చదువుకోవడం ద్వారా కుల, మత, ఆర్థిక గోడలు కూలిపోవాలన్నదే ఈ చట్టం అసలు ఉద్దేశమని వివరించారు. కానీ అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.

కఠిన అమలే పరిష్కారం

రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం సామాజిక మార్పుకు కీలక సాధనమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు కూడా ఈ హక్కు వర్తింపజేయాలని, దీనిపై జిల్లా డీఈవో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్య హక్కు అమలులో ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మారెళ్ళ విజయకుమార్ స్పష్టం చేశారు.
.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.