epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూమి లేనివారికి 72 గజాల స్థ‌లం.. ఇళ్లు

భూమి లేనివారికి 72 గజాల స్థ‌లం.. ఇళ్లు
భూమిలేని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇస్తాం
రైతులకు మేలు చేసేందుకే భూభారతి చట్టం
మహబూబాబాద్ జిల్లాకు రూ.3.16 కోట్ల లబ్ధి
సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్
రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాకతీయ, మరిపెడ : పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుట్టంలాంటి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వారి సమస్యలకు పరిష్కారం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూమిలేని పట్టణ ప్రజలకు 72 గజాల విస్తీర్ణంతో ఇళ్లను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు మంజూరైన సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను మంత్రి, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే , డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్‌తో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

కోట్ల రూపాయల లబ్ధి..!

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.3.16 కోట్ల విలువైన రైతు పనిముట్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అర్హులైన రైతులందరికీ ఈ యంత్రాలను అందజేస్తామని చెప్పారు. రైతుల ఆదాయం పెంపుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారని, రైతుల కష్టాలు ప్రజా ప్రభుత్వంతోనే తీరుతాయని స్పష్టమైందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన బీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. రైతులకు గుదిబండగా మారిన ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూభారతి వంటి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్నాలు పండించిన రైతులందరికీ క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. నిరుపేదల సుభిక్షం కోసం సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వడ్డీ లేని రుణాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ నళ్ళు సుధాకర్ రెడ్డి, అధికారులు ఏడీఏ విజయచంద్ర, మండల వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్, తాసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ విజయానంద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.