epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి
ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి విన‌తుల వెల్లువ‌
అర్జీల పెండింగ్‌కు నో
నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని కలెక్టర్ల ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్/పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల/జగిత్యాల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి గణనీయ స్పందన లభించింది. వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో వినతులు అందగా జిల్లా కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు తక్షణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పెండింగ్‌ను సహించబోమని హెచ్చరించారు.

కరీంనగర్ : 345 వినతులు, శాఖల వారీ సమీక్ష

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 345 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రతి అర్జీపై క్షేత్రస్థాయి విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు.

పెద్దపల్లి : భూ, గృహ సమస్యలపై దృష్టి

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అసైన్‌మెంట్ భూముల పట్టాలు, వారసత్వ మార్పిడి, డబుల్ బెడ్ రూమ్ గృహాల మంజూరు, దివ్యాంగ కోటా, వైద్య సహాయం వంటి అంశాలపై వినతులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల : 164 అర్జీలు, రెవెన్యూ అధికం

రాజన్న సిరిసిల్లలో ప్రజావాణికి 164 దరఖాస్తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణానికి 25, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు 13 చొప్పున వినతులు వచ్చాయి. ఇతర శాఖలకు కూడా పలు అంశాలపై అర్జీలు అందాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.

జగిత్యాల : 62 ఫిర్యాదులు, సమగ్ర విచారణకు ఆదేశం

జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా స్వీకరించిన వినతులను సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధంగా న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.