epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ?

సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి..

భార్య, మామను కిరాత‌కంగా చంపినట్లు అనుమానం !

కుటుంబ కలహాలే కార‌ణం?

రాజీవ్ గృహకల్పలో తండ్రి, కుమార్తె సజీవ దహనం

మంటల్లో సజీవ దహనమైన తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ

హనుమకొండ జిల్లా క‌డిపికొండ‌లో దారుణం

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ‌ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం క‌డిపికొండ‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కుమార్తెలు సజీవ దహనమయ్యారు. అల్లుడు ప్రవీణ్ కుటుంబ కలహాలతో ఇద్దరినీ సజీవదహనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. భాషబోయిన రాజశేఖర్ (54) అతని కుమార్తె రాజశ్రీ (24) మంటల్లో కాలిపోతుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆటో డ్రైవర్​గా పని చేస్తున్న భాషబోయిన రాజశేఖర్​కు ముగ్గురు కుమార్తెలు కాగా రాజశ్రీ పెద్దమ్మాయి. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్​లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప ఉన్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలతో వచ్చి తండ్రితో పాటే హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రాజీవ్‌గృహకల్పలో బ‌్లాక్ 5లో ఉంటోంది. కుటుంబ తగాదాలు, భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఈ తరుణంలో రాజశేఖర్, రాజశ్రీ (24) సజీవ దహనమ‌య్యారు.

పొంతనలేని సమాధానాలు

భార్యతో గొడవలు తదితర కారణాలతో అల్లుడు ప్రవీణే భార్య, మామను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుత్తితో తలమీద కొట్టి ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అనాథలైన పిల్లలు

నిన్నటివరకూ బాగానే ఉన్న తండ్రీ కుమార్తెలు ఇద్దరూ మంటల్లో కాలిపోయి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజశ్రీ చనిపోవడంతో రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ జ‌రిగిన‌ట్లు తొలుత ప్రచారం

పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం గదిలో ఉన్న ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. ఇంట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు తప్పించుకునే అవకాశం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. విద్యుత్ లోపం కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై స్పష్టత రానుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.