మేమంతా ఎంపీ వద్దిరాజు సైన్యమే
కాస్త ఓపిక పట్టండి.. రాబోయే ప్రభుత్వం మనదే..
విమర్శిస్తున్న వారికి చెంప పెట్టు కావాలి
మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో నాయకుల ధ్వజం
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీలో అనేక వర్గపరులు ఉన్నాయని ఎవరికి వారే యమునా తీరు అంటూ ఇతర పార్టీ పెద్దలు విచక్షణజ్ఞానాన్నికోల్పోయివిమర్శిస్తున్నారని అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా కాస్త ఓపిక పట్టండి రాబోయే ప్రభుత్వమే మనదని వర్గ పోరు లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మేమంతా సైనికులుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో శక్తి వంచన లేకుండా పని చేస్తామని పలువురు నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వలస నాయకుడు కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లా మచ్చలేని నాయకుడని టిఆర్ఎస్ బాధ్యతలను తన భుజాన వేసుకొని జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 8 టీఆర్ఎస్ కార్పొరేటర్ లను గెలిపించుకున్న సత్తా ఏమిటో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు చూపించారని ఆరోపించారు. కల్లబొల్లి మాటలతో అమలు కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిన కాంగ్రెస్కు రానున్న రోజుల్లో ప్రజలు చక్కటి గుణపాతం నేర్పుతారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి టిఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్ఎస్ లో వర్గ పోరు లేదని గడిచే రెండేళ్లు ఓపిక పడితే రానున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి టిఆర్ఎస్ నాయకులు బీమా శ్రీధర్ బొమ్మిడి రమాకాంత్, శ్రీకాంత్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.

