epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‌కు మ‌ళ్లీ అధికారం క‌ల్లా..!

బీఆర్ఎస్‌కు మ‌ళ్లీ అధికారం క‌ల్లా..!
అధికారం కోల్పోయానే ఆక్రోశంతోనే హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు
పార్టీలో ప్రాధాన్యం లేక అసంబ‌ద్ధ‌త‌తో మాట్లాడుతున్న‌ హరీశ్ రావు
గ‌త ప్ర‌భుత్వంలో అవినీతి, అక్ర‌మాల‌తోనే అధికారం కోల్పోయారు
సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్‌ను టార్గెట్
కానీ ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌ల ద‌శాబ్దాల క‌ల అది.. ఆ క‌ల‌ను నెర‌వేర్చి తీరుతాం
రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ ఎస్ నేత‌ల‌కు లేదు
కబ్జా భూమిలోనే హరీష్‌రావు స‌భ‌
వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : బీఆర్ఎస్ నేతల్లో అధికారం కోల్పోయిన ఆందోళన, ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని పదే పదే ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలో తగిన ప్రాధాన్యం లేక హరీశ్ రావు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష

సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల కల అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడే దుమ్ముగూడెం ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఆ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుపై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సెంట్రల్ వాటర్ కమీషన్ అనుమతులు లేకుండా కమీషన్ల కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

కబ్జా భూమిలోనే హరీష్‌రావు స‌భ‌

హరీశ్ రావు నిర్వహించిన సమావేశం కబ్జా భూమిలోనే జరిగిందని మంత్రి ఆరోపించారు. కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉన్నవారితో కలిసి నీతులు చెప్పడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర ప్రస్తుత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. కబ్జాలు, కమీషన్ల విషయంలో ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటకు వచ్చి రైతాంగం శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పామాయిల్ ఫ్యాక్టరీపై చర్చకు సిద్ధమా అని హరీశ్ రావును సవాల్ చేశారు. వాస్తవాల ఆధారంగా చర్చకు రావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.