అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
: ఎస్ఐ అపూర్వ రెడ్డి
కమలాయపల్లిలో రెండు వాహనాల స్వాధీనం
అనుమతులు లేకుండా రవాణా చేస్తే కఠిన చర్యలు
కాకతీయ,చేర్యాల: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండాఅక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం మండల పరిధిలో పట్టుకున్నట్లు ఎస్ఐ జీ.అపూర్వ రెడ్డి తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలంలోని కమలయపల్లి గ్రామంలో రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడగగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని చేర్యాల పోలీ్సస్టేషన్కు తరలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేనిదే ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సైతం జప్తు చేసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు.

